EPFO Shock | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్- ఈపీఎఫ్వో EPFO ) లో సభ్యులకు భారీ షాక్ ఇచ్చింది. ఈపీఎఫ్వో సభ్యుల డిపాజిట్లపై వడ్డీరేటు భారీగా తగ్గించివేసింది. నాలుగు దశాబ్దాల స్థాయికి కుదిస్తూ శనివారం ప్రతిపాదించింది. 2020-21లో ఈపీఎఫ్వో సభ్యుల డిపాజిట్లపై వడ్డీరేటు 8.5 శాతం ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాన్ని 8.1 శాతానికి కుదించివేసింది.
1977-78 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్వో సభ్యుల డిపాజిట్లపై వడ్డీరేటు 8 శాతం. ఈ నెలాఖరు నాటికి ఈపీఎఫ్వోలో సభ్యుల సంఖ్య 50 మిలియన్లకు చేరుకుంటుంది. ఈపీఎఫ్వోలో సభ్యుల డిపాజిట్లపై వడ్డీరేటు 8.10 శాతంగా సంస్థ కేంద్ర బోర్డు నిర్ణయించింది.
దీనిపై త్వరలో ఈపీఎఫ్వో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2019-20, 2020-21ల్లో ఈపీఎఫ్వోలో సభ్యుల డిపాజిట్లపై వడ్డీరేటు 8.5 శాతం, 2018-19లో 8.65, 2017-18లో 8.55 శాతంగా ఉంది.