న్యూఢిల్లీ, నవంబర్ 21: ఎడ్యుటెక్ సేవల సంస్థ బైజూస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకివ్వబోతున్నట్టు తెలుస్తున్నది. విదేశీ ఎక్సేంజ్ చట్టానికి లోబడి రూ.9 వేల కోట్ల నిధుల తరలింపు కేసులో సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు కేసులో బైజూస్, కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ రవీంద్రన్ బైజూస్కు ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి ఈడీ సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ఏప్రిల్ నెలలోనే ఈడీ..కంపెనీకి సంబంధించిన కార్యాలయాలపై దాడుల చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఫేమా నిబంధనలను పట్టించుకోకుండా నిధులను మళ్లించినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ..దీనిపై త్వరలో షోకాజ్ నోటీసులు జారీ చేయబోతున్నది.