అంబర్పేట/కాచిగూడ, మే 25: పనుల్లో నాణ్యత లోపించకుండావరదనీటి రిటైనింగ్ వాల్ను నిర్మించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. అంబర్పేట డివిజన్ పటేల్నగర్ ఎస్టీపీ వాటర్వర్క్స్ గేటు వద్ద రూ.12 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వరదనీటి కాలువ రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులను పిలిచి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వాల్ నిర్మాణం నాణ్యతతో చేయాలని చెప్పారు. వేగంగా పనులు జరిగేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సంతోష్, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్రెడ్డి, మోహిన్, గౌస్, సతీశ్, కిశోర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు స్థానికులు పరిశీలించినప్పుడే నాణ్యమైన అభివృద్ధి పనులు జరుగుతాయని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్ బర్కత్పుర విక్రమ్నగర్ ఇటీవల లక్షల వ్యయంతో వేసిన సీసీ రోడ్డు, ఫుట్పాత్ పనులను మంగళవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పరిశీలించారు. అనంతరం డివిజన్లో పలు ప్రాంతాల్లో సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి ప్రజల నుంచి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లోని వీధి దీపాలు, డ్రైనేజీలు, పారిశుధ్యం, అరకొరగా సరఫరా అవుతున్న మంచినీటి తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ నూతనంగా వేస్తున్న రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. కాచిగూడ డివిజన్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జలమండలి డీఎంసీ సన్యాసిరావు, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సంతోశ్, ఏఈ ప్రేరణ, బస్తీవాసులు పాల్గొన్నారు.