న్యూఢిల్లీ: సామాజిన మాధ్యమం ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి షాకివ్వనున్నారు. కొత్తగా ఎక్స్ అకౌంట్ తీసుకునేవారు (X New Users) డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కొత్త యూజర్లు ఎక్స్లో పోస్ట్ చేయాలన్నా, ట్వీట్లకు లైక్ చేయడంతోపాటు రిప్లే ఇవ్వాలన్నా చివరికి బుక్మార్క్ చేయడానికి కూడా చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. ఎక్స్కి సంబంధించి రోజువారీ వార్తలను అందించే ఎక్స్ న్యూస్ ఈ మేరకు వెల్లడించింది. కొత్త వినియోగదారులు నామమాత్రపు వార్షిక రుసుమును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ విధానంలో ఇప్పటికే న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్లో అమలులో ఉందని తెలిపింది. దీనిద్వారా స్పామ్ను తగ్గించడంతోపాటు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుందని చెప్పింది. కాగా, ఈ ట్వీట్పై మస్క్ స్పందిస్తూ.. దురదృష్టవశాత్తూ, కొత్త యూజర్లు రైటింగ్ యాక్సెస్ కోసం చిన్నమొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బాట్ల దాడిని అరికట్టడానికి ఇదే ఏకైక మార్గమన్నారు.