న్యూఢిల్లీ, నవంబర్ 25: మనీలాండరింగ్ కేసులో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్టెక్, దాని ప్రమోటర్లు నిధుల్ని అక్రమంగా మళ్లించారన్న కేసుకు సంబంధించి గుర్గావ్లోని డీఎల్ఎఫ్ ఆవరణల్లో రెండురోజులుపాటు సోదాలు జరిపి, కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
సూపర్టెక్ అంశంలో కొంత సమాచారాన్ని కోరుతూ తమ ఆవరణల్లోకి ఈడీ అధికారుల బృందం వచ్చినట్టు డీఎల్ఎఫ్ శనివారం స్టాక్ ఎక్సేంజీలకు వెల్లడించింది. ఇన్వెస్టర్లు, హోంబయ్యర్లకు చెందిన కోట్లాది రూపాయిల్ని వివిధ షెల్ కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలపై ఈడీ ఇప్పటికే సూపర్టెక్ ప్రమోటర్ రామ్కిషోర్ అరోరాను అరెస్టు చేసింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల పోలీసులు సూపర్టెక్, దాని గ్రూప్ కంపెనీలపై 26 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.