Google | వాషింగ్టన్, జూన్ 24: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయి. అమెజాన్ 15 బిలియన్ డాలర్లు, గూగుల్ 10 బిలియన్ డాలర్ల చొప్పున ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. కాగా, అమెజాన్ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే దేశంలోకి ఆ సంస్థ ద్వారా వచ్చిన పెట్టుబడుల విలువ 26 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆ సంస్థ సీఈవో ఆండీ జెస్సీ తెలిపారు.
ఇప్పటికే భారత్లో 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్టు గుర్తుచేశారు. ఇక భారతీయ డిజిటైజేషన్ ఫండ్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్టు గూగుల్ భారత సంతతి సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.