న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో.. తమ వేదికపైనున్న నకిలీ వస్తూత్పత్తులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గడిచిన 6 నెలల్లో ఏకంగా దాదాపు 42 లక్షల నకిలీ ప్రోడక్ట్స్ను తమ సైట్ నుంచి తొలగించింది. అలాగే మరో 10 లక్షల నిషేధిత ఉత్పత్తులనూ తీసేసినట్టు బుధవారం ఆ సంస్థ తెలియజేసింది. కాగా, తొలగించిన ఈ 52 లక్షల ఉత్పత్తులు..
మీషో వేదికపై ఉన్న మొత్తం ఉత్పత్తుల్లో 5 శాతం లోపేనని కంపెనీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక తమ ‘ప్రాజెక్ట్ సురక్ష’ సిస్టమ్స్.. 12వేలకుపైగా బ్యాడ్ యాక్టర్ అకౌంట్స్ను గుర్తించి బ్లాక్ చేసినట్టు మీషో పేర్కొన్నది. జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులతో ముందుకెళ్తున్న మీషో.. భారతీయ ఆన్లైన్ మార్కెట్లో చెప్పుకోదగ్గ వాటానే కలిగి ఉన్నది.