Fraud- ICICI Bank Manager | భారత సంతతి అమెరికన్ మహిళ.. ఐసీఐసీఐ బ్యాంకులో మదుపు చేసిన రూ.13.5 కోట్ల సొమ్మును సంబంధిత బ్యాంక్ మేనేజర్ స్వాహా చేశాడు. వాటిని మోసపూరిత కార్యక్రమాల్లో ఖర్చు చేశాడని శ్వేతా శర్మ బీబీసీకి చెప్పారు. అమెరికాలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.13.5 కోట్లు ట్రాన్స్ఫర్ చేశానని, వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని భావించినట్లు బీబీసీకి శ్వేత శర్మ తెలిపారు. తన భర్తతో కలిసి భారత్కు తిరిగొచ్చిన తర్వాత ఫ్రెండ్ ద్వారా సదరు బ్యాంకు మేనేజర్’ను కలుసకున్నట్లు చెప్పారు.
అమెరికాతో పోలిస్తే భారత్లో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల 5.5-6 శాతం వడ్డీ లభిస్తుందని బ్యాంకు మేనేజర్ నమ్మ బలికాడని శ్వేతా శర్మ చెప్పారు. కానీ, నాకు అతడు ‘ఫేక్ స్టేట్మెంట్లు, నా బ్యాంకు ఖాతా పేరిట ఫేక్ ఈ-మెయల్ ఐడీ నకిలీవి క్రియేట్ చేశాడని, బ్యాంకు నోటిపికేషన్లు ఏమీ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల కాలం (2019 సెప్టెంబర్-2023 డిసెంబర్) మధ్య తమ జీవితమంతా పొదుపు చేసిన రూ.13.5 కోట్లు పొదుపు చేస్తే మెచ్యూరిటీ తేదీ నాటికి రూ.16 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
కానీ గత నెలలో మెరుగైన రిటర్న్స్ కోసం పెట్టిన పెట్టుబడుల్లో ఆ మనీ తుడిచి పెట్టుకుపోయిందని అదే బ్యాంకుశాఖ మరో అధికారి చెప్పారని శ్వేతా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు బ్యాంకు అధికారిని సస్పెండ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐసీఐసీఐ అధికార ప్రతినిధి చెప్పారు. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులకు ఫిర్యాదు చేశామని, ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారి ప్రతినిధి చెప్పారు.
ఐసీఐసీఐ వివరణ
వినియోగాదారుల ప్రయోజనాలే తమకు ప్రథమ కర్తవ్యమని, వారి ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి అంకితభావంతో ఉన్నామని ఐసీఐసీఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. వివాదస్పదమైన రూ. 9.27 కోట్ల నగదును కస్టమర్ ఖాతాకు బదిలీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, 2 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ను ఆమె ఎన్క్యాష్ చేసుకుందని బ్యాంకు తెలిపింది. ఈ ఇష్యూపై విచారణ కొనసాగుతున్నందున పూర్తి విషయాలు మాట్లడలేక పోతున్నామని, అయితే మీడియా లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు క్లారిటి మాత్రం ఇవ్వదల్చుకున్నామని చెప్పారు.
1. కొన్ని సంవత్సరాల క్రితం అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ప్రతి లావాదేవీలను కస్టమర్ రిజిష్టర్ మొబైల్, ఇ-మెయిల్ ఐడీకి పంపుతున్నాము. అయితే గత మూడేళ్లుగా తన ఖాతాలో జరిగిన లావాదేవీల గురించి తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేస్తున్నది. తన అకౌంట్లో బ్యాలెన్స్ వ్యత్యాసాన్ని రీసెంట్గా గమనించానని చెపుతున్నది. ప్రతి ఏటా ఇన్కమ్ట్యాక్స్ ఫైల్ చేసేటపుడు కూడా ఈ విషయాన్ని ఆమె తెలుసుకోవచ్చు.
2. తన అకౌంట్కు సంబంధించిన ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడీలను తనకు తెలియకుండానే మార్చినట్లు ఆమె ఆరోపిస్తున్నది. అయితే ఈ రెండు మార్పులకు సంబంధించి తన రిజిష్టర్ మొబైల్, ఇ-మెయిల్ ఐడీలకు బ్యాంకు నుంచి నోటిఫికేషన్ వెళ్లినట్లు మా రికార్డుల్లో నమొదయింది. ఆమె మార్చుకున్న కొత్త నంబరు ఆమె కంపెనీ వెబ్సైట్లో కూడా లిస్ట్ అయింది.
ఏది ఏమైనా వినియోగదారుల ఆర్థిక ప్రయోజనాలను రక్షించడానికి ఐసీఐసీఐ బ్యాంకు కట్టుబడి ఉంది. ఏదైతే ఇష్యూ జరిగిందో దానిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేశాము.