ముంబై, జూలై 14: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 66 వేల పాయింట్లపైన ముగిసింది. 502.01 పాయింట్లు పెరిగి 66,159.79 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 150.75 పాయింట్లు ఎగబాకి 19,564.50 వద్ద స్థిరపడింది. టీసీఎస్ షేరు 5 శాతానికిపైగా ఎగిసి టాప్ గెయినర్గా నిలిచింది.