ముంబై, ఏప్రిల్ 9 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా ప్రకటించిన సీజ్ ఫైర్పై అనిశ్చితి నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా కోల్పోయాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. మధ్యాహ్నం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలను మరింత పెంచాయి.
చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 931.25 పాయింట్లు లేదా 1.20 శాతం పతనం చెంది 76,631.65 వద్దకు జారుకున్నది. ఇంట్రాడేలో 1,215 పాయింట్లు నష్టపోయింది. మరో సూచీ ఎస్ఎన్ఈ నిఫ్టీ 222.25 పాయింట్లు కోల్పోయి 23,775.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా-ఇజ్రాయెల్లు ఇరాన్పై చేస్తున్న యుద్ధంపై సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్..లెబనాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుస లాభాలకు బ్రేక్పడినట్టు అయింది.