ముంబై, అక్టోబర్ 27: మెటల్, రియల్టీ, ఇంధన రంగ షేర్ల ధన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్ అయినప్పటికీ దేశీయ సూచీలు మాత్రం భారీగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 212.88 పాయింట్లు లాభపడి 59,756.84 పాయింట్ల ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 80.60 పాయింట్లు అందుకొని 17,736.95 పాయింట్లకు చేరుకున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పెరగడంతోపాటు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగినప్పటికీ సూచీలు లాభపడటం విశేషమని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
టాటా స్టీల్ అత్యధికంగా 3 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు పవర్ గ్రిడ్, సన్ఫార్మా, ఎయిర్టెల్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, రెడ్డీస్, ఎన్టీపీసీలు లాభాల్లో ముగిశాయి.
కానీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, నెస్లె షేర్లు పతనం చెందాయి.