ముంబై, ఏప్రిల్ 19 : దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ బుధవారం నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు విదేశీ సంస్ఠాత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోవడంతో సూచీలు దిగువముఖం పట్టాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 159.21 పాయింట్లు కోల్పోయి 59,567.80 వద్దకు, నిఫ్టీ 41.40 పాయింట్లు నష్టపోయి 17,618.75 వద్ద ముగిసింది. హెచ్సీఎల్ టెక్నాలజీ షేరు 2.4 శాతం నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది.