ముంబై, సెప్టెంబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫెడ్ సెగ గట్టిగానే తగిలింది. వడ్డీరేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకున్న నిర్ణయంతో దేశీయ కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవడం మార్కెట్లలో అలజడి సృష్టించింది. సెన్సెక్స్ 337.06 పాయింట్లు నష్టపోయి 59,119.72 వద్ద ముగిసింది.
మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 88.55 పాయింట్లు పతనం చెంది 17,629.80 వద్ద స్థిరపడింది. వచ్చే ఏడాదిలోగా మరో 1.25 శాతం మేర వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్ చైర్మన్ ప్రకటించడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు.