ముంబై, మార్చి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టపోతున్నది. ఐటీ, ఆర్థిక, చమురు రంగ షేర్లలో భారీగా క్రయ విక్రయాలు జరగడంతో ప్రధాన సూచీలు ఒక్కశాతానికి పైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన ట్రెండ్ సూచీలను మరింత ముంచింది. ఫలితంగా దేశీయ మార్కెట్లకు శుక్రవారం బ్లాక్ఫ్రైడేగా నిలిచింది. ఒక దశలో 59 వేల దిగువ 58,885 పాయింట్లకు పడిపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 671.15 పాయింట్లు లేదా 1.12 శాతం తగ్గి 59,135.13 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 176.70 పాయింట్లు తగ్గి 17,412.90 వద్దకు జారుకున్నది. దీంతో లక్ష కోట్ల రూపాయల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. శుక్రవారం కూడా బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాప్ రూ.1,36,037.96 కోట్లు కరిగిపోయి రూ.2,62,94,723.65 కోట్లుగా నమోదైంది.