ముంబై, అక్టోబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతోపాటు గ్లోబల్ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో దేశీయ సూచీలు అదేదారిలో పయనించాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోతుండటం మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి.
అమెరికా బాండ్ ఈల్డ్ మరింత బలోపేతం కావడంతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ మెరుగుపడింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 231.62 పాయింట్లు కోల్పోయి 65,397. 62 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 320 పాయింట్లు నష్టపోయిన సూచీ చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించింది. మరో సూచీ నిఫ్టీ కూడా 82.05 పాయింట్లు కోల్పోయి 19,542.65 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 885.12 పాయింటు ్ల(1.33 శాతం), నిఫ్టీ 208.4 పాయింట్లు (1.05 శాతం) పడిపోయింది.