Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోష్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులకు ముందుకు రావడం కలిసొచ్చింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. మార్కెట్ సెంటిమెంట్ను బాగానే దెబ్బతీశాయి. అయితే ఈ ప్రభావం నుంచి తేరుకున్న ఇన్వెస్టర్లు.. గత వారం కొనుగోళ్లకు మద్దతిచ్చారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 3,076.60 పాయింట్లు ఎగబాకి 76,905.51 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 953.20 పాయింట్లు ఎగిసి 23,350.40 దగ్గర ముగిసింది.
అయితే గత వారం వరుస లాభాల్లో ఉండటంతో ఈ వారం మదుపరులు లాభాల స్వీకరణకు దిగే వీలుందన్న అంచనాలు గట్టిగా వస్తున్నాయి. కానీ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ స్థిరంగా బలపడుతుండటంతో మార్కెట్లు పరుగులు పెట్టవచ్చని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,700 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,600-23,900 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడుదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.