హైదరాబాద్, ఫిబ్రవరి 14: దేశీయ మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,469.73 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.903.89 కోట్ల లాభం కంటే ఇది 62 శాతం అధికం.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.5,746. 47 కోట్లకు ఎగబాకింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5.75 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది.