న్యూఢిల్లీ/ముంబై, జూలై 18: దేశీయ బ్యాంకులు ఆకర్షణీయ లాభాలను ప్రకటిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను శనివారం జోరును ప్రదర్శించాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం రూ.19,060 కోట్లుగా ఉన్నది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.18,155 కోట్ల నికర లాభాన్ని అందుకున్నది. అయితే మొత్తం ఆదాయం మాత్రం గతంతో పోల్చితే ఈసారి రూ.99,200 కోట్ల నుంచి రూ.92,184 కోట్లకు పడిపోయింది. అయినప్పటికీ వడ్డీ ఆదాయం రూ.77.470 కోట్ల నుంచి రూ.79,363 కోట్లకు పెరిగింది.
