Air Traffic | దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గురువారం (నవంబర్ 23) నాడు 5,988 విమాన సర్వీసులతో 4,63,417 మంది ప్రయాణించారు. ఈ నెల 18,19,20 తేదీల్లో ఒక్కోరోజు విమాన ప్రయాణాలు చేసిన వారి సంఖ్య కొత్త రికార్డులు నమోదు చేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ తెలిపింది. దేశీయ పౌర విమాన యాన రంగంలో కొత్త రికార్డు నమోదైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.
‘సానుకూల దృక్పథం, ప్రగతిశీల విధానాలు, ప్రయాణీకులలో లోతైన విశ్వాసం ప్రతి రోజు ప్రతి విమానంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి’ అని ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. ‘కొవిడ్ తర్వాత దేశీయ విమానయాన రంగం పుంజుకున్నది. విమాన ప్రయాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని పేర్కొంది. నవంబర్లో నాలుగు రెట్ల విమాన ప్రయాణికులు పెరిగాయని తెలిపింది.