హైదరాబాద్, ఆగస్టు 7: హైదరాబాద్ కేంద్ర స్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన దివీస్ ల్యాబ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.557 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.492 కోట్లతో పోలిస్తే 13 శాతం అధికమని పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,748 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికంలో రూ.1,997 కోట్లకు ఎగబాకినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో ఫారెక్స్ గెయిన్తో రూ.20 కోట్లు సమకూరడం లాభాల్లో వృద్ధికి దోహదపడినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.