Mass Layoffs : ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ఫాం డిస్కార్డ్ మాస్ లేఆఫ్స్ను ప్రకటించింది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. గూగుల్, అమెజాన్, మెటా సహా పలు టెక్ దిగ్గజాలు లేటెస్ట్ లేఆఫ్స్కు తెగబడిన నేపధ్యంలో డిస్కార్డ్ సైతం పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగుల సమావేశంలో డిస్కార్డ్ సీఈవో జేసన్ సిట్రన్ కొలువుల కోతపై సమాచారం చేరవేయగా, లేఆఫ్స్కు సంబంధించి ఇంటర్నల్ మెమోను షేర్ చేశారు. తాము మరింత కలిసికట్టుగా పనిచేస్తూ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటామని లేఆఫ్స్కు దారితీసిన పరిస్ధితులను వివరించారు.
కంపెనీలోని వివిధ విభాగాలకు చెందిన 170 మందిపై లేఆఫ్స్ ప్రభావం ఉంటుందని కంపెనీ పేర్కొంది. గత ఏడాది ఆగస్ట్లో డిస్కార్డ్ చివరిసారిగా ప్రకటించిన లేఆఫ్స్లో 4 శాతం ఉద్యోగులను తొలగించారు. అయితే డిస్కార్డ్ ప్రకటించిన తాజా లేఆఫ్స్లో అత్యధికంగా ఏకంగా 17 శాతం మంది ఉద్యోగులను సాగనంపుతున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకే కొలువుల కోతకు కంపెనీ తెగబడలేదని, ఓవర్ హైరింగ్ కూడా ఈ పరిస్ధితికి కారణమని చెబుతున్నారు.
గత కొన్నేండ్లుగా కంపెనీ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఉద్యోగులకు పంపిన మెమోలో సిట్రన్ పేర్కొన్నారు. తాము వేగంగా ఎదిగామని, ఉద్యోగుల సంఖ్యను మరింత వేగంగా విస్తరించామని 2020 నుంచి ఏకంగా ఐదు రెట్లు సిబ్బంది సంఖ్య పెరిగిందని రాసుకొచ్చారు. ఇక సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇంటీవల తన ఏఐ డివిజన్లో వందలాది ఉద్యోగులను తొలగించగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.
Read More :
Air India | మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. వెజ్ మీల్స్లో చికెన్ ముక్కలొచ్చాయంటూ మహిళ ట్వీట్