న్యూఢిల్లీ, జనవరి 12: దేశీయ ఐటీ దిగ్గజాల నిరాశాజనక ఫలితాలు కొనసాగుతున్నాయి. తాజాగా విప్రో నికర లాభం భారీగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,694.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,052.9 కోట్ల లాభంతో పోలిస్తే 11.74 శాతం తగ్గింది. రెండో త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే మాత్రం ఒక్క శాతం మేర పెరగడం విశేషం. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.23,229 కోట్ల రూ.22,205.1 కోట్లకు తగ్గింది. నికరంగా చూస్తే నాలుగు శాతం తగ్గినైట్లెంది.