ముంబై, ఆగస్టు 11: దేశంలో స్థూల పరోక్ష పన్నుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు 10వరకూ గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 15.73 శాతం వృద్ధిచెంది రూ. 6.53 లక్షల కోట్లకు చేరినట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్స్ను మినహాయిస్తే నికర పన్ను వసూళ్లు 17.33 శాతం వృద్ధితో రూ.5.84 కోట్లుగా నమోదయినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శుక్రవారం వెల్లడించింది.
2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో సమర్పించిన అంచనాల్లో ఇప్పటివరకూ 32.03 శాతం వసూళ్లు జరిగాయన్నది. అలాగే ఆగస్టు 10 వరకూ రూ. 69,000 కోట్ల రిఫండ్స్ జారీచేశామని, నిరుడుకంటే ఇవి 3.73 శాతం పెరిగాయని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలు కావచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరం వసూలైన రూ.16.61 లక్షల కోట్లకంటే 9.75 శాతం వృద్ధిచెందుతాయని పేర్కొన్నారు.