న్యూఢిల్లీ, జూలై 24: డిజిటల్ చెల్లింపులు-ఫిన్టెక్ వేదిక ఫోన్పే.. సోమవారం తమ యాప్ ద్వారా ఆదాయ పన్ను (ఐటీ) చెల్లించేలా ఓ ఫీచర్ను ప్రారంభించింది. ఐటీ పోర్టల్లోకి లాగిన కాకుండానే వ్యక్తులు, వ్యాపారులు.. ఫోన్పే ద్వారా క్రెడిట్ కార్డు లేదా యూపీఐతో సెల్ఫ్ అసెస్మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ను చెల్లించవచ్చని సంస్థ ఈ సందర్భంగా పేర్కొన్నది. రెండు పని దినాల్లోగా ట్యాక్స్ పోర్టల్కు సదరు మొత్తం క్రెడిట్ అవుతుందని చెప్పింది.
‘వినియోగదారులు తమ పన్నును చెల్లించాలనుకుంటే తొలుత ఫోన్పే యాప్లోకి లాగినై ‘ఇన్కమ్ ట్యాక్స్’ ఐకాన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత చెల్లించేది ఏ రకమైన పన్ను, మదింపు సంవత్సరం, పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. చివరగా పన్ను ఎంతో ఆ మొత్తాన్ని టైప్ చేసి, పేమెంట్ విధానాన్ని ఎంచుకుంటే సరిపోతుంది’ అని ఫోన్పే వివరించింది. ఈ ప్రక్రియ ముగిసిన ఒక్కరోజులోగా ట్యాక్స్పేయర్లు ఓ యూనిక్ ట్రాన్జాక్షన్ రిఫరెన్స్ (యూటీఆర్) నంబర్ను రశీదుగా అందుకుంటారు.