న్యూయార్క్ : టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ (Layoffs) ట్రెండ్ కొనసాగుతోంది. డిజిటల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సిమిలర్వెబ్ ఏడు నెలల్లో రెండో దశ లేఆఫ్స్ ప్రకటించడం కలకలం రేపింది. ఈ ఏడాది తొలి క్వార్టర్ త్రైమాసిక ఫలితాలతో పాటు లేఆఫ్స్ను కంపెనీ ప్రకటించడం టెకీల్లో గుబులు రేపుతోంది. ఇజ్రాయిల్ వెలుపలి ప్రాంతాల్లో పనిచేసే వారే అధికంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఉన్నారు.
తాజా లేఆఫ్స్లో కంపెనీలో ఆరు శాతం అంటే దాదాపు 60 మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేసింది. గత ఏడాది నవంబర్లో 2022 మూడో క్వార్టర్ ఆర్ధిక ఫలితాలు వెల్లడించే క్రమంలో సిమిలర్వెబ్ తన ఉద్యోగుల్లో పది శాతం మందిని అంటే 130 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వెబ్సైట్ ట్రాఫిక్ అనలిటిక్స్ను విశ్లేషించే ఇజ్రాయిల్ వెబ్ అనలిటిక్స్ కంపెనీ టెల్అవీవ్ కేంద్రంగా పనిచేస్తోంది.
ఇక ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్నాయి. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే అమెజాన్, మెటా, ట్విట్టర్ సహా పలు టెక్నాలజీ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
Read More
IBM | ఏఐపై ఐబీఎం సీనియర్ ఎగ్జిక్యూటివ్ కీలక వ్యాఖ్యలు