హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 16 ( నమస్తే తెలంగాణ) : జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈనెల 18 నుంచి ‘డిజి యాత్ర’ సేవలను ప్రారంభిస్తున్నది. కాగిత రహిత సేవలను ప్రోత్సహించడం లక్ష్యంగా మూడు నెలల పాటు ఈ సేవలను అందించనుంది. కాగిత రహిత టికెట్, వివిధ ద్వారాల వద్ద చెక్ పాయింట్లు వద్ద ఆటోమెటిక్గా ఎంట్రీ లభించేల ఏర్పాట్లు చేశారు. ముఖాన్ని గుర్తించే సిస్టంతో పలు గేట్ల వద్ద ఎంట్రీ విధానాన్ని మరింత సులభతరం చేసింది.
ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని నిర్వాహకులు సూచించారు. తొలుత ప్రయాణికులు డిజి యాప్ను ఓపెన్ చేయగానే ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను నమోదు చేయా ల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ వస్తుంది. తర్వాత ఫొటో అప్లోడ్ తదితర సూచనలు అనుగుణంగా వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. సదరు ప్రయాణికుడు ఎయిర్పోర్ట్లో ఎంట్రీ, ఔట్లు ఎలాంటి అవాంతరాలు, సమయభావం లేకుండా పొందొచ్చునని సూచించింది.