న్యూఢిల్లీ, జూలై 13: నాలుగేండ్ల క్రితం కార్యకలాపాలు నిలిపివేసిన జెట్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ను (ఏఓసీ) ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ రెన్యువల్ చేసింది. నిధుల కొరతతో 2019 ఏప్రిల్ 19న మూతపడిన జెట్ను గతంలో నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బిడ్డింగ్ ద్వారా జలాన్-కర్లోక్ కన్సార్షియం టేకోవర్ చేసింది. దీంతో డీజీసీఏ 2022 మే 20న ఏఓసీని జారీచేసినప్పటికీ, సంస్థ కార్యకలాపాల్ని ప్రారంభించలేకపోయింది. ఫలితంగా ఏఓసీ నిర్దేశిత గడువు ఈ ఏడాది మే 19న ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం వినతి మేరకు సర్టిఫికెట్ను రెన్యువల్ చేస్తూ సెప్టెంబర్ 3ను గడువుగా నిర్దేశించినట్టు జలాన్-కర్లోక్ కన్సార్షియం (జేకేసీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్లైన్స్ కార్యకలాపాల్ని పునరుద్దరించడానికి తాము కట్టుబడి ఉన్నట్టు జేకేసీ తెలిపింది.