DGCA | దేశీయ విమానాల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఈ ఏడాది జనవరి – మే మధ్య దేశీయ విమానాల్లో 6.36కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది 2022 సంవత్సరంలో 4.67కోట్ల మంది ప్రయాణించారు. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గతేడాదితో పోలిస్తే జనవరి నుంచి మే మధ్య కాలంలో 36.10శాతం వృద్ధి నమోదైంది. నెలవారీగా 15.24శాతం వృద్ధి నమోదైందని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పేర్కొంది. ఇదిలా గత కొద్ది నెలలుగా దేశీయ విమానయానరంగం వివిధ కారణాలతో ప్రతి నిత్యం చర్చల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల దేశంలోని విమానాశ్రయాల్లో రద్దీ నేపథ్యంలో సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయాన్ని పరిశీలించి, వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పలు సందర్భాల్లో సేవల్లో అంతరాయం, ప్రయాణికులు, సిబ్బంది అనుచిత ప్రవర్తన తదితర ఘటనలు ఇటీవల కాలంలో ముఖ్యాంశాలుగా మారాయి. ఇటీవల దేశంలోని ప్రముఖ ఎయిర్లైన్స్లో ఒటైన గోఫ్టస్ దివాలా ప్రక్రియ కారణంగా సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.