న్యూఢిల్లీ, జనవరి 14: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా దేవదత్త చంద్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్ను బీవోబీ బాస్గా ఆర్థిక సేవల ఇన్స్టిట్యూషన్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) సూచించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో పదవికి కూడా రాజ్నీష్ కర్ణాటక పేరును ప్రతిపాదించింది. ఈ రెండు బ్యాంక్ల అధిపతులకోసం శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ రెండు పేర్లను కేంద్రానికి సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ది అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నది.