Deposits | ముంబై, జూలై 18: డిపాజిట్లు ఆరేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో జూన్ చివరినాటికి బ్యాంక్ల్లో డిపాజిట్లు రూ.191.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రూ.3.62 లక్షల కోట్ల రూ.2 వేల నోట్లలో మూడొంతులు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని రిజర్వుబ్యాంక్ ఇటీవల వెల్లడించింది.
కేర్ రేటింగ్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ..గత నెల చివరి నాటికి డిపాజిట్లు 13 శాతం పెరిగి రూ.191.6 లక్షల కోట్లకు చేరుకున్నాయని, మార్చి 2017 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి అని చెప్పారు. ఏడాది క్రితం రూ.185.7 లక్షల కోట్లుగా ఉన్న డిపాజిట్లు ప్రస్తుతం బాగా పెరిగాయి.