PPF & SSY | మీకు పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) అకౌంట్లు ఉన్నాయా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వాటిల్లో నగదు డిపాజిట్ చేయలేదా.. అయితే, ఆయా అకౌంట్లు యాక్టివ్గా కొనసాగించేందుకు ఈ నెలాఖరులోగా కొంత మనీ డిపాజిట్ చేయాలి. ఈ నెల 31 లోపు పీపీఎఫ్, ఎస్ఎస్వై ఖాతాల్లో డబ్బు జమ చేయకుంటే ఆ రెండు ఖాతాలు ఇన్యాక్టివ్ (మూసివేస్తారు) అవుతాయి.
ఈ రెండు ఖాతాల్లో సకాలంలో కనీస మొత్తం జమ చేయకుంటే, వాటిని యాక్టివేట్ చేయడానికి కొంత ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు పెట్టుబడి పథకాల్లో కనీస మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీ పీపీఎఫ్, ఎస్ఎస్వై ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయా.. లేదా.. అన్న సంగతి తెలుసుకోవడానికి కనీస మొత్తం డిపాజిట్ చేయాలి.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)లో కనీస మొత్తం రూ.500 డిపాజిట్ చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. లేనిపక్షంలో మీ ఖాతా మూసేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తం డిపాజిట్ చేయడానికి తుది గడువు ఈ నెల 31. గడువులోపు మనీ డిపాజిట్ చేయకుంటే ఏడాదికి రూ.50 చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈ పథకంలో పెట్టుబడులపై రుణం తీసుకోలేరు.. మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత విత్డ్రా చేసుకోలేరు. కాగా, ఈ పథకంపై ఇన్వెస్టర్లకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకంలో ఖాతా ఉన్నట్లయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కనీస మొత్తం డిపాజిట్ చేయకుంటే రూ.50 ఫైన్ పే చేయాలి. ఇక ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడులపై ఏడాది ప్రాతిపదికన 7.6 శాతం వడ్డీ అమలవుతున్నది.