హైదరాబాద్, ఏప్రిల్ 12: బ్రిటన్ కేంద్రంగా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న డెలివరూ..హైదరాబాద్లో అతిపెద్ద ఇంజినీరింగ్ సెంటర్ను మంగళవారం ప్రారంభించింది. బ్రిటన్ అవతల ఏర్పాటు చేసిన అతిపెద్ద టెక్నాలజీ సెంటర్ ఇదే కావడం విశేషం. ఈ ఇంజినీరింగ్ సెంటర్ కోసం ఈ ఏడాది చివరినాటికి 150 మంది సిబ్బందిని నియమించుకోనున్న సంస్థ..2023 చివరినాటికి ఈ సంఖ్యను రెండింతలు పెంచుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 20 మంది ఇంజినీర్లను రిక్రూట్ చేసుకున్నట్లు, ఈ డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 150కి పెంచుకోనున్నట్లు డిలివరో ఇండియా వైస్ ప్రెసిడెంట్ శశి సోమవారపు తెలిపారు. డాటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, ఫ్రంట్-ఎండ్ అండ్ బ్యాంక్-ఎండ్ సర్వీసెస్ విభాగాలతోపాటు ప్రొడక్ట్ మేనేజర్లను హైదరాబాద్ సెంటర్ కోసం నియమించుకోనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రతిభకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్
మారిపోయిందని, అందుకోసం ఇక్కడ ఇంజినీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లో అవకాశాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రతిభ కలిగిన సిబ్బంది లభించడమే అని తెలిపారు. అంతర్జాతీయ సేవలు ఇక్కడి నుంచే అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ..టెక్నాలజీ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, ముఖ్యంగా ఏఐ, ఎంఎల్, సైబర్సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్, బ్లాక్ చెయిన్లకు అధిక డిమాండ్ ఉన్నదన్నారు.