Petrol Usage | దేశంలో పెట్రోల్ వినియోగం సాధారణ స్థాయికి చేరుకుంటున్నది. డిసెంబర్లో మహమ్మారికి ముందుకంటే 13 శాతానికి పైగా పెట్రోల్ వాడుతున్నారు. 2019 డిసెంబర్తో పోలిస్తే డీజిల్ వినియోగం 1.6 శాతం తక్కువగా ఉంది. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడం దీనికి కారణంగా తెలుస్తున్నది.
డీజిల్ కంటే పెట్రోల్ సేల్స్ నాలుగు శాతం పైచిలుకు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2020 డిసెంబర్తో పోలిస్తే పెట్రోల్ వినియోగం 1.4 శాతం ఎక్కువ. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ధోరణి పెరుగుతున్నది. గత నవంబర్తో పోలిస్తే 6.6 శాతం పెట్రోల్, 13.6 శాతం డీజిల్సేల్స్ పెరిగాయి.
విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ సేల్స్ 2020తో పోలిస్తే గత నెలలో 25 శాతానికి పైగా వృద్ధి చెందాయి. అయితే, 2019తో పోలిస్తే 26 శాతం తక్కువ. విమాన సర్వీసులు పెరగడంతో నవంబర్ నెలతో పోలిస్తే గత నెలలో సుమారు 10 శాతం ఎక్కువ జెట్ ఫ్యూయల్ సేల్స్ పెరిగాయి.
అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైతేనే జెట్ ఫ్యూయల్ వినియోగం సాధారణ స్థాయికి చేరుకోలేదని ఇండస్ట్రీ వర్గాల కథనం. వంట గ్యాస్ సిలిండర్ల వాడకం 2019తో పోలిస్తే ఐదు శాతం పెరిగింది. 2020 డిసెంబర్తో పోలిస్తే ఒకశాతం తక్కువ.