Nominee | ఖాతాదారు మృతి కారణంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు, వివిధ రకాల పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాంకులు, క్యాపిటల్ మార్కెట్ సంస్థలను అన్ని ఖాతాలకు నామినీ ఉన్నారో? లేదో? చూసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయల అన్క్లెయిమ్డ్ నగదు నిల్వలుండిపోయాయి. ఇదంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి చనిపోయినవారిదే. సదరు డిపాజిట్లకు నామినీలు లేకపోవడంతో ఆ సొమ్మంతా కూడా బ్యాంకుల్లోనే ఉండిపోతున్నది.
నామినీ అంటే?
అన్ని డిపాజిట్ ఖాతాలకు నామినీ తప్పనిసరి. ఖాతాదారుడు చనిపోయినప్పుడు అతను లేదా ఆమె చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), పెట్టుబడుల మొత్తాలు, వాటి ద్వారా పొందిన లాభాలు, ఇతరత్రా ప్రయోజనాలను వారివారి వారసులకు అందజేస్తారు. ఈ వారసులనే నామినీలుగా పేర్కొంటారు. భర్త, భార్య, తల్లిదండ్రులు, సంతానం, తోబుట్టువులు ఇలా చట్టపరంగా ఎవరైనా కావచ్చు. ఆన్లైన్లో లేదా బ్యాంక్ శాఖను నేరుగా సంప్రదించి అక్కడి సిబ్బంది సాయంతో ఫారం ద్వారా నామినీ జత చేయవచ్చు. మైనర్లను కూడా ఖాతాదారులు తమ నామినీగా ఎంచుకోవచ్చు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐలో నామినీ రిజిస్ట్రీ
యోనో యాప్ ద్వారా..