హైదరాబాద్, జనవరి 31: గ్రానైట్ల తయారీ సంస్థ దాసోస్..తాజాగా హైదరాబాద్లో హోమ్ ఇంటీరియర్ సేవలు ప్రారంభించింది. గృహానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించాలనే ఉద్దేశంతో నగరానికి సమీపంలో తూప్రాన్ వద్ద రూ.40 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించినట్టు కంపెనీ ఈడీ మనోజ్ కశ్యప్ తెలిపారు.
2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్తో వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. జర్మనీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఈక్విప్మెంట్తో మాడ్యులర్ ఫర్నిచర్ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.100 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.