Cyient DLM | న్యూఢిల్లీ, జూలై 10: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ ఎంట్రీ అదిరింది. లిస్టింగ్ రోజే సంస్థ షేర్ ధర 59 శాతం పెరిగింది. సోమవారం రూ.420.75 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో రూ.421.75 వద్ద స్థిరపడింది. ఇష్యూ ప్రైస్ రూ.265గానే ఉండటంతో ఒక్కరోజే అటు బీఎస్ఈలో 58.77 శాతం, ఇటు ఎన్ఎస్ఈలో 59.15 శాతం ఎగబాకినైట్టెంది.
బీఎస్ఈలో రూ.401, ఎన్ఎస్ఈలో రూ.403 దగ్గర సంస్థ షేర్ల ట్రేడింగ్ మొదలుకావడం గమనార్హం. మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో ఆ తర్వాత కూడా ఇదే జోష్ కొనసాగింది. ఒకానొక దశలో బీఎస్ఈలో రూ.426.45 గరిష్ఠాన్ని నమోదు చేసింది. కాగా, కంపెనీ మార్కెట్ విలువ రూ.3,336.81 కోట్లను తాకింది. హైదరాబాద్కు చెందిన ఐటీ కంపెనీ సైయెంట్ అనుబంధ సంస్థే ఈ సైయెంట్ డీఎల్ఎం అన్న విషయం తెలిసిందే.