న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: బంగారం ధరలు రికార్డు స్థాయిలోనే పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండోరోజూ దేశ రాజధానిలో సరికొత్త స్థాయిలను అందుకున్నాయి. మంగళవారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు మరో రూ.140 పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా రూ.71,840ని తాకింది. హైదరాబాద్లో తులం రూ.110 పుంజుకొని రూ.71,730గా ఉన్నది. 22 క్యారెట్ పసిడి విలువ కూడా రూ.100 అందుకుని రూ.65,750గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర ఢిల్లీలో రూ.500 ఎగిసి రూ.84,500 పలికింది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రన్ కొనసాగుతున్నది. కొమెక్స్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,350 డాలర్లుగా ఉన్నది. వెండి ఔన్సు 28.04 డాలర్లుగా ఉన్నది. అంతకుముందు 27.80 డాలర్లు.