Tech Mahindra- CP Gurnani | దేశంలోని సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టెక్ మహీంద్రా (Tech Mahindra) సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్నానీ (CP Gurnani) సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా వైదొలుగుతున్నారు. వచ్చేనెల 21న టెక్ మహీంద్రా (Tech Mahindra) డైరెక్టర్గా ఆయన వైదొలుగుతారని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. దానికి రెండు రోజుల ముందు డిసెంబర్ 19న టెక్ మహీంద్రా (Tech Mahindra) ఎండీ కం సీఈఓగానూ రిటైర్ అవుతారని పేర్కొంది.
సీపీ గుర్నానీతోపాటు కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా విజయ్ కుమార్ కూడా తప్పుకుంటారు. విజయ్ కుమార్ వయస్సు 65 ఏండ్లకు చేరుకోవడంతో ఆయన నామినేషన్ను భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉపసంహరించుకోవడంతో విజయ్ కుమార్ వైదొలుగుతున్నారు.
‘2004 నుంచి మహీంద్రా గ్రూపుతో అనుబంధం కలిగి ఉండటం ప్రివిలేజ్గా భావిస్తున్నా. 2020 ఏప్రిల్ నుంచి కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా వివిధ స్థాయిల్లో పని చేశాను’ అని సీపీ గుర్నానీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘నేను బోర్డులో మూడేండ్లకు పైగా పని చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజ్మెంట్ టీం, బోర్డు సభ్యులతో కలిసి పని చేసినందుకు గర్వంగా ఉంది’ అని తెలిపారు.
‘మహీంద్రా గ్రూపు డైరెక్టర్ గా పని చేసినంత కాలం యాజమాన్యం నుంచి పూర్తి మద్దతు లభించింది. నాకు మద్దతు తెలిపినందుకు బోర్డుకు, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని వెల్లడించారు. కంపెనీ డైరెక్టర్ గా వైదొలిగినా.. తదుపరి నాయకత్వానికి మార్గదర్శకత్వం వహిస్తానని సీపీ గుర్నానీ పేర్కొన్నారు.