న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:నిరుద్యోగులకు శుభవార్త. వచ్చే మూడు నెలల్లో భారీ స్థాయిలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థికం ఆశాజనకంగా ఉండటంతోపాటు ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కుదుటపడుతుండటంతో వచ్చే మూడు నెలల్లో సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలకు చెందిన 40 వేల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మ్యాన్పవర్ గ్రూపు ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేల్లో పాల్గొన్న సంస్థల్లో 54 శాతం సంస్థలు నియామకాలు మొగ్గుచూపాయి. భారత్ విషయానికి వస్తే 64 శాతం సంస్థలు తమ స్టాఫ్ను పెంచుకోనున్నట్లు వెల్లడించగా..10 శాతం మాత్రం తగ్గించుకోనున్నట్లు తెలిపాయి. ఉద్యోగ కల్పన దేశీయ జాబితాల్లో తొలి స్థానంలో బ్రెజిల్ ఉండగా..ఆ తర్వాతి స్థానంలో ఇండియా ఉన్నది.