న్యూఢిల్లీ : కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2021 కోసం కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్శిటీస్ (సీఎన్ఎల్యూ) కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను జూలై 23 న ఆఫ్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. ఇంతకుముందు ఈ పరీక్షను జూన్ 13 న నిర్వహించేందుకు నిర్ణయించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఈ పరీక్షను వాయిదా వేశారు. 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు (ఎన్ఎల్యూ), అనేక ఇతర క్లాట్ అనుబంధ న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అందించే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి నిర్వహిస్తారు.
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రెండు గంటలు సమయం ఇస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. దరఖాస్తు చివరి తేదీ తర్వాత పరీక్షా కేంద్రాల ప్రాధాన్యతను మార్చడానికి అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి పరీక్ష 120 నిమిషాలు ఉంటుంది. పరీక్షలో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. పరీక్షలో ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పీజీ క్లాట్ పరీక్ష కూడా 120 నిమిషాలపాటు ఉంటుంది. మొదటి విభాగంలో 100 ఆబ్జెక్టివ్ రకం ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. రెండవ విభాగంలో రెండు వివరణాత్మక వ్యాసాలు రాయాల్సి ఉంటుంది.
ఏనుగుల దాడి : జైలులో గ్రామస్థుల బస
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
గైర్హాజరు ఎందుకో : బెంగాల్ బీజేపీలో ముదురుతున్న సంక్షోభం
చరిత్రలో ఈరోజు : గల్వాన్ వీరులకు వందనం
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
ప్రోటీన్ వనరు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్తమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..