అదానీ వ్యవహారంలో అసలు నిజాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తోనే బయటకొస్తాయి. కీలకమైన దేశ మౌలిక రంగంలో విదేశీ వ్యక్తుల పాత్ర ఎలా ఉంటున్నది. తన ఆప్త మిత్రుల కోసం ప్రధాన మోదీ ఎలా నియమ, నిబంధనల్ని ఉల్లంఘించారో తెలియాలంటే జేపీసీ అవసరం. ఇక డొల్ల కంపెనీలతో అదానీ గ్రూప్నకున్న సంబంధాలపై సెబీ ఎందుకు సరిగ్గా విచారించలేకపోయిందో అంతుబట్టడం లేదు. 13 బినామీ డొల్ల కంపెనీల్లో రెండింటికి యజమానులు ఎవరన్నది ఏండ్ల తరబడి విచారించినా సెబీ కనుక్కోలేకపోయింది. ఈ అంశంలో సెబీ పాత్రపైనా అనుమానాలు కలుగుతున్నాయి. 2014లో అదానీ గ్రూప్పై డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) చేపట్టిన విచారణల్ని సుప్రీం కోర్టుకు సెబీ ఎందుకు తెలియపర్చలేదో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మోదీ నోరు విప్పాలి.
-జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి