ముంబై, మే 6: ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ గురువారం జనవరి – మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర ఆదాయం 37.60 శాతం పెరిగి 505 మిలియన్ డాలర్లుగా నమోదయింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 7 శాతం నుంచి 9 శాతం రెవెన్యూ గ్రోత్ ఉండొచ్చని అంచనా వేస్తున్నది. గత ఏడాది మార్చి త్రైమాసికంలో నికర ఆదాయం 367 మిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు 505 మిలియన్ డాలర్లకు పెరిగింది.
కాగ్నిజెంట్ డిజిటల్ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగింది. డిజిటల్ రెవెన్యూ వాటా ఆదాయంలో 44 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో ఈ వాటా 39 శాతంగా ఉంది. 2021లో రెవెన్యూ గ్రోత్ 7 శాతం నుండి 9 శాతంగా ఉంటుందని అంనచా వేసింది. జూన్ త్రైమాసికం రెవెన్యూ గ్రోత్ 10.5 శాతం నుండి 11.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.