హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్లెయిన్ జెవెల్లరీ పై బ్యాంగిల్స్, చైన్స్, నెక్లెసెస్ పై 9 శాతం తక్కువ వేస్టేజ్ను తీసివేస్తూ వినియోగదారులకు మేలు జరిగే విధంగా బెస్ట్ వే మెథడ్లో ఆభరణాలను అందజేస్తున్నట్లు సీఎంఆర్ సోమాజిగూడ స్టోర్ హెడ్ జ్యోతుల శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటికే భారీస్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని అన్నారు. కుందన, నగిషీ, డీఫ్ నగిషీ, డైమండ్ ఐటమ్స్తో పాటు అనేక రకాల డిజైన్లతో కూడిన నగలు, ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ అవకాశం జంటనగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని వెల్లడించారు. కొనుగోలుదారులకు నచ్చే రీతిలో అనేక రకాల డిజైన్లు, సరికొత్త లుక్తో ఆకట్టుకునే విధంగా ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని ఈ శ్రావణ మాసం ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 9శాతం అంటే ఇది చాలా తక్కువ వేస్టేజ్ కిందకి వస్తుందని, కొనుగోలుదారులు త్వరపడాలని సూచించారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.