హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ) : జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం.. గోయల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ) ఆమోదించిన రూ.596.61 కోట్ల నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు.
స్మార్ట్సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్ధించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ , ఏరోస్పేస్ పారును ఏర్పాటు చేసిందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ -బెంగళూరు పారిశ్రామిక కారిడార్ను ఏరో-డిఫెన్స్ కారిడార్గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.