Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 74,826.94 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ సెన్సెక్స్ కోలేదు. ఇంట్రాడేలో 74,986.22 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. 74,454.55 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 667.55 పాయింట్ల నష్టంతో 74,502.90 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 183.50 పాయింట్లు పతనమై 22,704.70 వద్ద ముగిసింది. మార్కెట్లో దాదాపు 1473 షేర్లు పురోగమించగా.. 1871 షేర్లు పతనమయ్యాయి. మరో 90 షేర్లు మారలేదు. హిందాల్కో, పవర్గ్రిడ్ కార్పొరేషన్, దివిస్ ల్యాబ్, నెస్లే, సన్ ఫార్మా, సిప్లా, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్ లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్ నష్టాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, టెలికాం, హెల్త్కేర్, మెటల్, పవర్ లాభాల్లో ముగియగా.. ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ 0.3-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.