హైదరాబాద్, నవంబర్ 3: ఐటీ సేవలు అందిస్తున్న సిగ్నిటీ టెక్నాలజీ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.451.83 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.45.86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన ఆదాయంతో పోలిస్తే 8 శాతం వృద్ధి చెందగా, నికర లాభంలో 10 శాతం పెరుగుదల కనిపించింది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో శ్రీకాంత్ చకిలం మాట్లాడుతూ..ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ ఆదాయ, లాభాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాదికిగాను సంస్థ రూ.3 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది.