న్యూఢిల్లీ, నవంబర్ 4: టాటా ఎంటర్ప్రైజెస్కు చెందిన రిటైల్ దిగ్గజం క్రోమా..దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. టీవీలు, వాషింగ్మిషిన్లు, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది.
ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్లలో 15 శాతం క్యాష్బ్యాక్తోపాటు ఎక్సేంజ్ ప్రయోజనాల కింద రూ.20 వేల వరకు, 24 నెలల ఈఎంఐలను ఎంచుకునే అవకాశం కల్పించింది.