న్యూఢిల్లీ, నవంబర్ 10: మూలధన లాభాల పన్నుల వ్యవస్థలో మార్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. సంక్లిష్టమైన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వ్యవస్థను సరళీకరించి, హేతుబద్దీకరించేందుకు చర్చలు జరుపుతున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పలు రకాల ఆస్తుల్ని కొనుగోలు చేసినప్పటి నుంచి విక్రయించేంతవరకూ అట్టిపెట్టుకునే కాలపరిమితికి అనుగుణంగా మూలధన లాభాలపై పన్ను విధింపు ఉంటుంది. ఈ కాలపరిమితుల్లో మార్పులు చేసే అంశాన్ని ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు ఆ అధికారి వివరించారు. 2019లో డైరెక్ట్ ట్యాక్స్ టాస్క్ ఫోర్స్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతున్నదని, వచ్చే బడ్జెట్ సమర్పణకు ముందు అత్యున్నతస్థాయిలో తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.
చర్చల్లో ఉన్న ప్రతిపాదనలివి…