2.5 లక్షలు దాటితే అమలు
నేటి నుంచి కేంద్రం కొత్త నిబంధనలు
హైదరాబాద్, మార్చి 31 : ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీపై ఆదాయం పన్ను (ఐటీ) విధించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. పీఎఫ్ ఖాతాలో అధిక మొత్తంలో జమ చేసే ఉద్యోగులకు శుక్రవారం నుంచి పన్ను భారం పడనున్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షలు దాటితే అదనంగా జమ చేసిన మొత్తంపై వచ్చిన వడ్డీపై పన్ను విధించనున్నారు. ఒకవేళ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక ఉద్యోగి 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం జమ చేస్తే పన్ను వేయదగిన మొత్తాన్ని వేరే ఖాతాలో వేస్తారు. దానిపై వచ్చిన వడ్డీపై పన్ను విధిస్తారు. దీనికి సంబంధించి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త రూల్స్నూ నోటిఫై చేసింది. ఇందులో భాగంగానే సెక్షన్ 9డీని కొత్తగా తెచ్చారు.
రెండు పీఎఫ్ ఖాతాలు
ఇకపై రెండు ఖాతాలను నిర్వహిస్తారు. ఏడాదికి రూ.2.5 లక్షలకు మించని (పన్ను చెల్లించాల్సిన అవసరం లేని పెట్టుబడి) ఖాతా, అలాగే అంతకు మించి ఉన్న ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. క్లోజింగ్ బ్యా లెన్స్ పద్ధతిలో లెకిస్తారు. ఒక అకౌంట్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ పరిమితికి మించిన డబ్బులు మరో అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. దీనివల్ల పన్ను లెకింపు సులభతరమవుతుంది.
ఆ నిధులకు మినహాయింపు?
మార్చి 31, 2021కి ముందు ఖాతాలో ఉండే పీఎఫ్ నిధిపై ఎలాంటి పన్నూ ఉండదు. అంటే 2021-2022 వార్షిక సంవత్సరానికి ముందు జమచేసిన పీఎఫ్ నిధులపై వచ్చిన వడ్డీపై ఎలాంటి పన్నూ విధించరు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి తమ వాటాగా రూ.2.5 లక్షల కంటే ఎకువ నిధులు జమచేసిన ఉద్యోగులపైనే తాజాగా ఆదాయం పన్ను విధిస్తారు. అలాగే వడ్డీపై మాత్రమే పన్ను ఉంటుంది. ఇక ఉద్యోగ సంస్థలు తమ తరఫు నుంచి ఎలాంటి నిధులూ భవిష్య నిధిలో జమ చేయకపోతే ఈ పరిమితిని రూ.5 లక్షలుగా నిర్దేశించారు. అంటే ఇకడ ఉద్యోగి మాత్రమే పీఎఫ్ కడతారు.