Excise Duty Reduction on Petrol | సామాన్యుడిపై కేంద్రం ఎట్టకేలకు కరుణ చూపింది. పెట్రోల్, డీజిల్ ధరలు కాసింత తగ్గనున్నాయి. లీటర్ పెట్రోల్ మీద రూ.8, లీటర్ డీజిల్పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు.
దీని ప్రభావంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.లక్ష కోట్ల ఆదాయం తగ్గుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాజా ధరల తగ్గింపుతో లీటర్ పెట్రోల్పై రూ.9.50, లీటర్ డీజిల్పై రూ.7 తగ్గుతుందని తెలిపారు.
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన స్కీం కింద వంట గ్యాస్ సిలిండర్పై రూ.200 సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.6,100 కోట్ల ఆదాయం తగ్గుతుందన్నారు.